పుట:Aandhrakavula-charitramu.pdf/672

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

645

ద గ్గు ప ల్లి దు గ్గ య్య

విశాఖపట్టణమండలములోని విజయనగరసంస్థానాధిపతులగు పూసపాటివారు తా మీ మాధవవర్మసంతతివార మని చెప్పుకొందురు. కృతిపతియైన గంగామాత్యుడొకనాడు కొలువుండి

   క."సరసులు సుకవీంద్రులఁ దను
      బరివేష్టింపంగఁ గావ్యబంధురగోష్టీ
      పరుఁ డగుచు నుండి యస్మ
      త్సరసవచోవైఖరుల హృదయమునఁ దలఁచెన్

వ. తలఁచి యప్పుడు పరమానందంబున సామాజికులం జూచి యిట్లనియె

   చ. శ్రుతుల విహారదేశములు సుస్థిరవాక్యపద ప్రమాణ శా
      స్త్రతతులయిక్క లాగమపురాణచయమ్ముల కేళిసద్మముల్
      స్మృతులనివాసముల్ కవిసమీహితసత్కవితాగుణప్రసా
      దితములు దగ్గుపల్లి కవితిప్పయదుగ్గని గద్యపద్యముల్.”

అన్నట్లు కవి కృత్యాదిని జెప్పెను. దుగ్గన శ్రీనాథునికాలములో బాల కవి యయి యాతని యనంతరముననే కాంచీమాహాత్మ్యమును, నాచికేతూపాఖ్యానమును జేసినట్టు కనఁబడుచున్నాడు. కృతిపతికాలమును బట్టి విచారింపఁగా నీకవి 1490 వ సంవత్సరప్రాంతమువఱకు నుండి కావ్యరచనము చేయుచుండిన ట్టూహింపఁదగి యున్నది. నంది మల్లయ్యయు, ఘంటసింగయ్యయుఁ గలిసి తాము రచించిన ప్రబోధచంద్రోదయ పద్యకావ్యము నీ గంగయామాత్యునకే యంకితము చేసిరి. అటు తరువాత నీ కవులే తమ వరాహ పురాణమును 1503 వ సంవత్సర ప్రాంతమునందు రాజ్యపాలనము చేయు చుండిన కృష్ణ దేవరాయని తండ్రియైన నరసింహదేవరాయనికిఁ గృతి యిచ్చిరి. గంగయామాత్యుఁడు సాళువ నరసింహరాయని కాలములో నుండక తత్పూర్వమునందే యుండినవాఁ డనుకొన్నను 1490 వ సంవత్సర ప్రాంతమువఱకైన నుండి యుండవలెను. ఆ వఱకే కాంచీపురమాహాత్మ్యమును రచియించి తరువాతనే నాచికేతూపాఖ్యానమును రచియించి