పుట:Aandhrakavula-charitramu.pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

644

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       ఉ. మా పినతండ్రి గంగయయమత్యశిఖామణి తత్తనూభవుం
           డై పెనుపొందు దేవసచివాగ్రణీ కిచ్చితి వంధ్రభాషఁ గాం
           చీపురనాధు దివ్యకథ చిత్రతరంబుగ విస్తరించి నీ
           వోపుదు వార్యహృద్యమధురోక్తుల సత్కృతు లొప్పఁ జెప్పఁగన్.

ఇతఁడు తన విద్యాగురువును, బావయు నైన శ్రీనాథునిపాండిత్య ప్రభావమును వర్ణించుచు నాతఁడు కర్ణాటవిభునిచేత కనకరత్నాభిషేకమును పొందిన వృత్తాంతమును గూడఁ జెప్పి యున్నాడు. కవి దగ్గుపల్లి తిప్పనార్యునకును నెఱ్ఱమకును పుత్రుఁడు; శాండిల్య గోత్రుఁడు; పోతనకును నెఱ్ఱనకును దమ్ముఁడు. ఈ గ్రంధమును రచియించుటకు ముందే యీ కవి కాంచీపుర మాహాత్మ్యమును రచియించి కృతిపతి పినతండ్రి కుమారుఁడైన దేవయామాత్యున కంకిత మొనర్చెను. కృతిపతియైన చెందలూరి గంగామాత్యుఁడు మాధవవర్మవంశమువాఁడైన తమ్మురాజుయొక్క కుమారుడగు బసవ నృపాలున కాప్తసచివుఁడైనట్లీ క్రింది పద్యమునఁ జెప్పఁబడెను.

        సీ. చతురంగబలము విజయవాడ దుర్గాంబ
                            వరమునఁ బడసి దుర్వారలీల
           జగతీస్థలం బెల్ల సాధించి జయశాస
                            నములు దిగ్దంతిదంతముల సలిపి
           పేదబాలునకుఁగాఁ బ్రియసుతమోహంబు
                            పట్టక బెజవాడపాడి నిలిపి
           కలయంగఁ బురమునఁ గాంచనవర్షంబు
                            గురియించి దేవతాకోటి పొగడ

           వసుధ నెగడిన మాధవవర్మవంశ
           వర్దనుండగు తమ్మభూవరుని బసవ
           పార్థివున కాప్తుడై కృపాపాత్రుఁ డగుచు
           ఘనత మెఱసె ననంతయగంగవిభుఁడు.