పుట:Aandhrakavula-charitramu.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

629

గౌ ర న మం త్రి

మాధవనృపాలుఁడని తేటపడుచున్నది. ఈ మాధవనృపాలునికి పెద్దన సుతుఁడైన పోతరాజు మంత్రి యైనట్టు వెలుగోటి వంక చరిత్రమునందుదాహరింపఁబడిన యొక శిలాశాసనములోని యీ క్రింది శ్లోకముల వలనఁ దెలియవచ్చుచున్నది.

     శ్లో. శ్రీమతో మాధవేంద్రస్య రాజ్యాంగైకధురంధరః,
          మంత్రి పోత నామాసీత్ సర్వశాస్త్రవిశారదః |
          యస్యామాత్యశిఖామణేః కవివరస్తోత్రైకపాత్రీకృతాం
          మత్వా వాక్పతి రిద్దనీతి సుభగాం వాగ్వైఖరీం లజ్జతే.
          సోయం పెద్దనమంత్రి వర్యతనయః శ్రీపోతరాజో౽న్వహం
          దేవస్యాస్య మహోపకారరచనాం సమ్యఙ్ముదాచీకరత్.

రాచకొండ కీశాన్యమూలను రెండు క్రోసుల దూరములోనున్న నాగార గ్రామమునందలి మాధవనృపాలుని భార్య శాసనములో

      శ్లో. శాకాఖ్యే నిధివార్దిరామశశిగేఽప్యబ్దే ప్లవంగే శుభే
          మానే ప్యాశ్వయుజే రఘూద్వహపదే యేరాఘవీయాహ్వయామ్
          టీకా మర్ధపటుప్రబోధఘటనా మాణిక్యపుష్పాంజలిం
          కృత్వా రాజతి రావు మాధవనృపో రామాయణస్య శ్రియే.

అని శాలివాహనశకము 1346 ప్లవంగసంవత్సరాశ్వయుజమాసమున ననఁగా క్రీస్తు శకము 1427వ సంవత్సరమునందు రావు మాధవనరపాలుఁడు శ్రీమద్రామాయణమునకు రాఘవీయమను టీకను జేసెనని చెప్పఁబడినది. 1427 వ సంవత్సరమునం దుండిన రావు మాధవనృపాలుని మంత్రిగా నుండిన పోతరాజుతమ్మునికుమారుఁడై న మన గౌరనకవి 1440 -50 వ సంవత్సర ప్రాంతములం దుండి యుండవలెను. అందుచేత గౌరనమంత్రి శ్రీనాథకవి యొక్క యంత్యకాలములోను, తదనంతరమునను నుండినందుకు సందేహము లేదు. [గౌరన పేర్కొనిన రావు సింగయ మాధవభూపాలుని గూర్చి యభిప్రాయభేదము లున్నవి. ఇతఁడు బేతాళ రెడ్డి కెనిమిదవ తరము వాఁడని శ్రీ వీరేశలింగమువంతులుగా రభిప్రాయపడినారు. శ్రీనాధుఁడు