పుట:Aandhrakavula-charitramu.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

628

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

        
        మతిమంతుఁ డయ్యలమంత్రిపుంగవుని
        సుతుఁడు గౌరనమంత్రి సుకవి శేఖరుఁడు
        కవు లెన్న నుత్తరకథ రచియించె

అని యయ్యలమంత్రిసుతుఁ డయినట్లు చెప్పఁబడి యున్నది. అయ్యల యని పొరపాటున నెల్లనకు మాఱుగా పడియుండును. మొదట నున్న దాని నయ్యల యని దిద్దుటకు వలనుపడదు. ఎల్లనామము రెండు చోట్లను సరిపడును. [గౌరనమంత్రి తండ్రి అయ్యలు మంత్రి; కాని, ఎల్లమంత్రి కాఁడు. 'యశోధనుఁ డెల్ల మంత్రి' యనుచోట 'యశోధనుఁ డయ్యమంత్రి' ఆని యుండదగును. లక్షణదీపికయందలి

‘ఆసీత్తస్యమహామాత్యః స్వామి కార్యధురంధరః |
పోతరాజ ఇతి ఖ్యాతో రాజనీతివిశారదః ||

మంత్రి చూడా మణే స్తస్య సోదరస్యాయ్యలు ప్రభో|
గౌరనార్య ఇతిఖ్యాతస్తనయో నయ కోవిద8 ||'

అను శ్లోకములను బట్టియు నీయంశమే తెలియుచున్నది. '....శ్రీమదయ్యలు మంత్రి శేఖర రత్నాకర రాకాసుధాకర శ్రీగౌరనామాత్య విరచితాయాం ..' అను లక్ష్మణదీపికాపరిచ్చేదాంతగద్యయు గౌరనతండ్రి అయ్యలుమంత్రి యనియే తెల్పుచున్నది.]

ఈ ద్విపదకావ్యమును మొట్ట మొదట ముద్రింపించిన (బ్రౌనుదొరవారీ కవి 1600 వ సంవత్సర ప్రాంత మునందుండినట్లభిప్రాయపడి తన పెదతండ్రియైన పెద్దనపోతరాజు సింగనమాధవ క్షితిపాలునిమంత్రి యైనట్టు కవి చెప్పెను గాని యీ పుస్తకమునుబట్టి యీ మాధవక్షితిపాలుఁ డెవ్వఁడో యే కాలమునం దుండినవాఁడో తెలియదు. ఈ కవియే సంస్కృతమున,'లక్షణదీపిక' యను ఛందశ్శాస్త్రము నొకదానిని రచియించెను. దానియందీ మాధవక్షితిపాలుని గూర్చి యీ క్రింది శ్లోకములోఁ గొంత వివరముగాఁ జెప్పెను.

      శ్లో. అస్తి ప్రశస్తావనిపాలమౌళి రత్నావళీరంజితపాదపీఠః
          రేచర్ల వంశార్ణవపూర్ణ చంద్రో మహాబల స్సింగయమాధవేంద్రః.

పయి శ్లోకమునందు రేచర్ల గోత్రము చెప్పఁబడి యుండుటచేత నీ మాధవక్షితిపాలుఁడు, బేతాళ రెడ్డి కెనిమిదవ తరమువాఁ డయిన రావు సింగయ