పుట:Aandhrakavula-charitramu.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిడుపర్తి నిమ్మనాథుడు


ఇతనికి నిమ్మయార్యుఁడనునది నామాంతరము ఇతని తండ్రి పినసోమయ్య. పద్యబసవపురాణకర్త పిడుపర్తి సోమనాథున కీతఁడు పెదతాత మనుమఁడు. ఇతనిని సోమనాథుఁడు తన పద్యబసవపురాణమునఁ బ్రశంసించి యున్నాఁడు. ఇతని రచనలేమో తెలియలేదు. ఇతఁడు 1390-1440 మధ్య నున్నవాఁడు. 'నిజలింగ చిక్కయ్యకథ' యీతని రచన యని ప్రాచ్యలిఖితపుస్తక భాండాగార పుస్తకపట్టికలోఁ గలదు. కాని యా నిమ్మనాథుఁడు పర్వత లింగయ్య పుత్రుఁడు; కావున నతఁడు వేఱు


ప్రోలుగంటి చెన్నశౌరి


ఇతఁడు ప్రౌఢరాయల వద్ద దండాధికారిగా నుండి తిప్పనకుఁ బ్రపౌత్రుఁడు; నాగశౌరి దేవమాంబలకు బుత్రుఁడు; ఇతని గ్రంథము లేవియు లభింప లేదు. హరిభట్టు రచించిన నృసింహపురాణములో నీతని ప్రశంస కలదు. దానిని బట్టి యీతఁడు నరసింహపురాణమును ద్విపదకావ్యముగను, బాలభారతమును వచనకావ్యముగను, సౌభరిచరిత్రమును యక్షగానముగను రచించినట్లు తెలియుచున్నది. ఈ కవి పదునైదవశతాబ్దియం దుత్తరార్ధమున నుండెనని చెప్పవచ్చును.

[పయి కవులం గూర్చిన చరిత్రములకు ‘ఆంధ్ర కవితరంగిణి' ఆధారము.]