పుట:Aandhrakavula-charitramu.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

615

బ మ్మె ర పో త రా జు

పేరు పెట్టి కల్పించి యుందురని నమ్ముటకుఁ దగిన హేతువులు కనఁబడక పోవుటచేతను నేను సత్యమని నమ్మినదానిని నా కవులచరిత్రములోఁ బ్రకటింపవలసినవాఁడనైతిని. నా పుస్తకము ప్రకటింపఁబడఁగానే యప్పుడు ప్రభుత్వము చేయుచుండి యిప్పుడు కీర్తి శేషులైన వేంకటగిరిరాజుగారు సర్వజ్ఞ సింగమనాయఁడు వేశ్యాగమనదోషదూషితుఁడు గాని యకళంక చరిత్రుఁడయిన విద్వాంసుఁడనియు, నట్టి మహనీయునిపయిని వేశ్యా సంపర్కదోషమారోపించుట తమ కవమానకరమనియు యా విషయమునఁ దృప్తి పొందవలసినదని నేను బదులు వ్రాసితిని. అందుపైని వారు తమ పురాతన గ్రంథమును వెదకీంపఁగాఁ వానిలోఁ దమ యాస్థానమునందే యా గ్రంథము దొరకినదని కొ౦త కాలమునకు మరల వ్రాసిరి. ఎటువంటి మహానుభావులకును నవస్థా భేదము లుండును. ప్రధమావస్థలోని దోషములు తదనంతరావసస్థలయందు నివారణము లగును ప్రథమదశలోని యనుభవమునుబట్టి కడచిన ప్రమాదమునకు పశ్చాత్తప్తుడయి పోతనార్యుఁడు ముందు రాజాస్థానములకుఁ బోఁగూడదనియు, రాజులకుఁ గృతులీయ్యగూడదనియు నియమము చేసికొని యుండును. కర్ణాట రాజులచేత నెప్పుడయిన నవమానితుఁడయి పోతన్న రాజులను ద్వేషించువాఁ డయియు నుండవచ్చును. భ్రమప్రమాదములు మనుష్యస్వభావము అగుట చేత నెటువంటి విద్వాంసులకును నొకానొకప్పుడు ప్రమాదము సంభవింప వచ్చును. అటువంటిది పూర్ణ చంద్రునిలోని కళంకమువలె మహానీయుల కీర్తి చంద్రికకు మాలిన్యము తీసికొని రాఁజాలదు.

శేషాద్రిరమణకవులు కృష్ణాపత్రికలో నెల్లుట్ల నారాయణకవిని గూర్చి వ్రాయునప్పుడును, తత్పూర్వమున, నెల్లుట్ల నృసింహరావుగారిని గూర్చి వ్రాసినప్పుడును వారు బమ్మెర పోతరాజువంశమువారని వ్రాసి యున్నారు. ఈ కధ యెంతమాత్రమును విశ్వాసార్హమయినది కాదు. బమ్మెర పోతనా మాత్యుని సంతతివా రాఱు వేలనియోగిశాఖవారు, నెల్లుట్ల వారు గోలకొండ