పుట:Aandhrakavula-charitramu.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

609

బ మ్మె ర పో త రా జు

   
    హతులను దప్పి నాఁకటను బంచత నొందెడునట్టి జీవుఁడున్
    వెతలను బూర్వకర్మభవ వేదన బొందుచుఁ గుందు నెప్పుఁడున్.
                                            ద్వాదశ స్కంధము.

బమ్మెరపోతరాజు నైజామురాజ్యములోని రాచకొండసంస్థానమునకు ప్రభువగు సర్వజ్ఞసింగమనాయని యాస్థానమునకుఁ బోయి యాతని యిష్టానుసారముగాఁ గవిత్వము చెప్పినందునకుఁ బోతరాజ ప్రణీతమయిన భోగినీ దండకము సాక్ష్యమిచ్చుచున్నది. ఈ దండకము సర్వజ్ఞ సింగమనాయఁడుంచుకొన్న వేశ్యవిషయమయి చెప్పఁబడినది. దాని కవిత్వ మించు మించుగా భాగవతమును బోలి యుండును. ఈ సర్వజ్ఞ సింగమనాయఁడు 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరమువఱకును విజయనగరాధీశ్వరుఁడుగా నున్న ప్రౌఢ దేవరాయనితో సమకాలికుఁడు. భోగినీదండకములోని కొంతభాగము నిందు వ్రాయుచున్నాను--

    కామానలజ్వాలల న్వేఁగి చింతాభరభ్రాంతయై యున్న యింతిం
    బరీక్షించి తన్మాత మాయాపరాభూతజామాత మిథ్యానయోపేత
    విజ్ఞాతనానావశీకారమంత్రౌషధవ్రాత లోకైకవిఖ్యాత వారాం
    గనాధర్మశిక్షాధిసంఖ్యాత సమ్మోహితానేక రాజన్యసంఘాత
    వాచాలతాబద్ధనానామహాభూత యేతెంచి కూతుఁన్ బరీక్షించి నీతి
    న్విచారించి బుద్దిన్వివేకించి బాలన్ మిళత్కుంతలవ్రాతఫాలన్
    గరాంభోజరాజత్కపోలన్ సమందోష్ణనిశ్వాసతాలన్ విపర్యస్త
    సన్యాసచేలన్ మహాందోళన ప్రేంఖితస్వర్ణ డోలన్ మృగేంద్రావ
    లగ్నన్ దయావృష్టిమగ్నన్ మనోజాగ్నిభగ్నన్ .. .. ... ...
    విలోకించి లోనం బరాయత్తమై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై
    విన్నయై ఖిన్నయై భిన్నమై యున్న భావంబుభావించి నెయ్యంబు గావించి
    బాలాజితత్వంబు మేలా విచారింపవేలా వినోదింపవేలా వయోధర్మ
    మున్ రిత్తగాఁ బుచ్చ నీవృత్తికి న్మెత్తురే వత్తురే కాముకుల్