పుట:Aandhrakavula-charitramu.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

595

బమ్మెర పోతరాజు

    
      ఉ. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
          సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
          సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
          బమ్మెరపోతరా జొకఁడు భాగవతంబు జగద్ధి తంబుగన్.

పోతరాజు తృతీయస్కంధమును తెనిఁగించునప్పుడు విష్ణుమూర్తి శ్వేత వరాహరూపమున నాతనివాకిటఁ బరుండుచు వచ్చెననియు, భాగవతము తన కంకితము చేయనన్నాఁడన్న కోపముచేత కవిని బాధించి కట్టి తెచ్చుటకై పంపిన కర్జటాధీశ్వరుని భటులను పారద్రోలె ననియు, మఱియొక కధ చెప్పుదురు. పోతరా జష్టమ స్కంధములోని గజేంద్రమోక్షకధను వ్రాయుచు "అలవైకుంఠపురంబులో నగరిలో నామూల" యనువఱ కొక పద్యమును వ్రాసి పై భాగము తోఁచక చింతిల్లుచు వెలుపలికిఁ బోయినప్పుడు విష్ణువు వచ్చి " సౌధంబు దాపల • యని వ్రాసి పోయె ననియు, ఇంకొక కధ చెప్పుదురు. భాగవతమును రచియించునప్పుడు కవి చెప్పిన సంగతి యెల్లను ప్రత్యక్షముగా జరుగుచు వచ్చెననియు, రుక్మిణీకల్యాణమును రచిం చుచు “దేవకీసుతుకోర్కి తీగలు వీడంగ" నను పద్యములో ‘బాలకమరె' యను భాగమును జెప్పునప్పు డాతని కుమార్తె కుంపటిలోఁబడి కమరిపోయె ననియు, “పద్మనయనువలనఁ బ్రమదంబు నిండారె" నను భాగమును జెప్పఁగానే మరల లేచి యధాప్రకారముగా నా చిన్నది సుఖముగా నుండె ననియు వేఱొకకథ చెప్పుదురు. చెప్పఁబూనినచో నిటువంటి కధల కంత ముండదు. అయినను మఱియొక చిన్న కథను మాత్రము వ్రాసి వీని నింతటితో పరిసమాప్తి నొందించెదను. పోతన గజేంద్రునికధఁ జెప్పుచు గజేంద్రుఁడు ప్రాణసంశయదశలో నున్నప్పుడు శ్రీమహావిష్ణువు

      మ. సిరికిం జెప్పఁడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁ డే
          పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం .
          తరధమ్మిల్లు చక్క నొత్తఁడు వివాద ప్రోద్ధత శ్రీకుచో
          పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై