పుట:Aandhrakavula-charitramu.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీనాథుఁడు

                  ధామముల వెండిపై ఁడియుఁ దడఁబడంగ
                   బ్రాహ్మణోత్తము లగ్రహారములయందు
                   వేమభూపాలుఁ డనుజన్ము వీరభద్రు
                   ధాత్రినేలింప గౌతమీతటమునందు.

అని యింకొకచోటను. అల్లాడభూపతి యగ్రపుత్రుడై న వేమభూపాలుఁడు నిజభుజావిక్రమమున నిఖిలదిశలు గెలిచి రాజ్యపీఠ మెక్కించి యనుజన్ముఁడైన వీరభద్రుని ధాత్రి నేలించెనని మాత్రము శ్రీనాథుఁడు చెప్పియున్నాఁడు భీమఖండమునందు వేమవీరభద్రనరపాలురరాజ్యము సింహాద్రి వఱకు మాత్రమే వ్యాపించినదని చెప్పఁబడినను కాశీఖండమునందు

     ఉ. ప్రాకటవిక్రమస్ఫురణ రాజమహేంద్రము రాజధానిగా
         నేకసీతాతపత్రమున నేలెను వీరనృపాలుఁ డుత్తమ
         శ్లోకుఁడు వేమశౌరియనుజుండు సమున్నతవైభవాఢ్యుఁడై
         చీఁకటియుం గళింగయును జిల్కసముద్రము సింహశైలమున్.

అని వీరభద్రారెడ్డిగాజ్యము చిల్కసముద్రమువఱకును వ్యాపించినట్టు చెప్పఁబడినందున పయి సీసవద్యములోఁ జెప్పఁబడినట్టు వేమారెడ్డి తమ్ముని పక్షమున సింహాద్రి మొదలుకొని చిల్కసముద్రమువఱకును గల రాజ్యమును నిజముగానే గెలిచి తమ్ముని కిచ్చి యుండును. వీరభద్రారెడ్డి కా రాజ్యము భార్యయైన యనితల్లి మూలమునఁ గాక తండ్రిమూలముననే వచ్చినదనెడుపక్షమున నల్లాడ రెడ్డికి జేష్ఠపుత్రుఁడుండగా ద్వితీయ పుత్రునకు వచ్చుటకుఁ గారణముండదు. తవ ప్రభువునకు భార్యమూలమునఁ బ్రభుత్వము వచ్చినదనుట గౌరవలోపమని భావించి శ్రీనాథుడీ సత్యమును మఱఁగుపఱిచి యుండును. రాజ్యలాభక్రమమును జెప్పకపోయినను కవి యనితల్లి వీరభద్రుని యిల్లాలగుటను మాత్రము చెప్ప విడువక యీ క్రింది పద్యములలో వర్ణించెను.

      ఉ. రాజశశాంకశేఖరుఁడు రాజకిరీటవతంస మష్టది
         గ్రాజమనోభయంకరుఁడు రాజులదేవర రాజరాజు శ్రీ