పుట:Aandhrakavula-charitramu.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

533

శ్రీనాథుఁడు

ఈ శ్లోకములను

          గీ. ఆననమునందు వైవర్ణ్య మగ్గలించెఁ
             గనుఁగవయందు దైన్యంబు గానఁబడియె
             నార్తి యేదేని యొకటి నీయంతరంగ
             మూని యున్నది యిది యెట్టు లొక్కొ యనఘ!

         సీ. లోలార్కునకు నీకు లోలోన నేమేని
                          పోటు వుట్టదు గదా మాటమాట
             వెనకయ్య శ్రీడుంఠివిఘ్నేశ్వరస్వామి
                          ధిక్కరింపఁడు గదా తెగువ నిన్ను
             నాఁకొన్న నీన్ను మధ్యాహ్నకాలంబున
                          నరయకుండదు గదా యన్నపూర్ణ
             నెపమేమియును లేక నీయెడాటమ్మునఁ
                          బాటి తప్పఁడు గదా భైరవుండు

             ఎట్టు పాసితి మిన్నేటి యిసుకతిప్ప
             నెట్టు పాసితి వాస్థలం బేనుక్రోసు
             లెట్టు పాసితి యవిముక్త హట్టభూమి
             యెట్టు పాసితి విశ్వేశు నిందుధరుని. "

అని మూలానుసారముగా నెంతో మనోహరముగా తెనిగించిన కొన్ని స్థలములయందు మూలము ననుసరించియే యాంధ్రీకరించినను బహస్థలముల యందు మూలము నతిక్రమించి తన యిష్టానుసారముగా

        శ్లో. 'సప్తగోదావరతట క్రీడాసక్తస్య శీకరైః
             గజాస్యస్య కరోన్ముక్తైః క్లిన్న మార్తాండమండలమ్.'

(సప్తగోదావరతటమున క్రీడాసక్తుఁడయి యున్న గజాననునియొక్క తుండముచేత నెగఁజిమ్మబడిన శీకరములచేత నార్ద్రమైన సూర్యబింబమును గలది) అనుదానిని,