పుట:Aandhrakavula-charitramu.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

538

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

         వీరభద్రేశ వేమపృధ్వీధవులకు
          ననుఁగుమంత్రి మహా ప్రధానాగ్రగణ్యు
          బెండపూడన్న జగనొబ్బగండబిరుద
          సచివదేవేంద్రుఁ గృతి కధీశ్వరునిఁ జేసి.

భీమేశ్వరపురాణమును రచించినట్టు కవి చెప్పుకొని యున్నాఁడు. పయివాని లోని మొదటి సీసపద్యముయొక్క నాలవచరణమువలనఁ గవి తా నావఱకే దేశాంగణములు తిరిగి కీర్తి నొందినట్లును, రెండవ సీసపద్యములోని మూడవ చరణమువలన వీరభద్రారెడ్డిరాజ్యము సింహాచలము పర్యంతమును వ్యాపించి యుండినట్టును దెలియవచ్చుచున్నది.

ఈకవికి విష్ణుకథలకంటె శివకధలమీఁద నాదర మత్యధికము. అందుచేత నీతడు భీమఖండములో సర్పపురకథయు, శ్రీకూర్మకథయు రెండు సర్గము లలో నున్నను వానిని దెనిగించుటలో నొక్క పద్యముతోను పద్యపాదము తోను సరి పెట్టెను. ఈతఁడు భీమఖండమును జేయుటలో 5-వ సర్గము నందలి

     శ్లో. అహో కి మేత న్మే బ్రూహి వైవర్జ్యం వదనే తవ.
        దృశ్యతే నేత్రయో ధైన్యం మానసవ్యథయానఘ !
        కశ్చి న్న జాతో వాగ్వాదః లోలార్కేణ సమం తవ
        డుంఠీ విఘ్నేశ్వరః కశ్చిత్ న త్వాం ధిక్కృతవా న్రుషా.
        కశ్చిత్త్వం క్షుధితః కాలే విశాలాక్ష్యా న వంచితః
        న కశ్చిత్త్వ య్యనుచితం భైరవేణ కృతం ముధా.
        కథం త్యక్తం త్వయా గంగావాహినీసైకతస్థలం
        కథం తత్పరమం స్థానం వ్యసృజ త్క్రోశపంచకం.
        కథం త్వంముక్తవాన్ప్రాప్యా మవిముక్తవసుంధరాం.
        కథం విశ్వేశ్వరం దేవం సతాముజ్ఝితవాన్ ధనం.