పుట:Aandhrakavula-charitramu.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

536

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

      సీ. ఏమంత్రికుల దైవ మిందుశేఖరుఁడు ద
                          క్షారామ భీమేశుఁ డఖిలకర్త
          యేమంత్రియేలిన యిక్ష్వాకుమాంధాతృ
                          రామసన్నిభుఁ డైనవేమనృపతి
          యేమంత్రిసితకీర్తి యేడువారాసుల
                          కడకొండయవలిచీఁకటికి గొంగ
          యేమంత్రిసౌభాగ్య మిగురుఁ గైదువ జోదు
                          లాలిత్యలీలకు మేలుబంతి

          యతఁడు కర్ణాటలాటబోటాంగవంగ
          కురుకుకురుకుంతలావంతి ఘూర్జరాది
          నృపసభాస్థానబుధవర్ణనీయసుగుణ
          మండనుఁడు బెండపూడన్న మంత్రివరుఁడు.

అని యొక్క పద్యములో వేనభూపాలుని మంత్రి యైనట్టు చెప్పి, యంతటితో నిలువక తరువాత ననావశ్యకముగా తదనుగ్రహసంపాదనార్థముగా వేమభూపాలుని వంశాభివర్ణనమును నడుమఁ బెట్టి

      సీ. పాతాళ భువనాధిపతికి శేషాహికిఁ
                      బ్రియలతో మసకానఁ బెఁడగఁగలిగె
         దిక్సింధురములకు దివ్యవాహిని లోనఁ
                     దేఁటిరాయిడి మా.. దేలనొదవె
         నుర్వీధరములకు నుదధిలోఁ గాపున్న :
                     కులముసాములయిండ్లఁ గడువనబ్బెఁ
         గుహనాకిటికి లక్ష్మికుచకుంభములమీఁది
                     కుంకుమంబు సుసు ల్గొనఁగఁగూడె

         రామ వేశ్యాభుజంగ వీరప్రతాప
         భాసి యల్లాడవీభువీరభద్ర నృపతి
         సర్వసర్వంసహాచక్ర సర్వభరము
         పృధుభుజావీరమున సంభరించుటయును.