పుట:Aandhrakavula-charitramu.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

480

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

             గీ. భట్టహర్షుండు బ్రౌఢవాక్పాటవమున
                నెద్ది రచియించి బుధలోకహితముఁ బొందె
                నట్టి నైషధసత్కావ్య మాంధ్రభాష
                ననఘ ! యొనరింపు నాపేర నంకితముగ.

ఆంధ్రనైషధపద్యకావ్యాంతమునందు శ్రీనాధుఁడు:

        "నై_షధశృంగారకావ్యం బాంద్రభాషా విశేషంబున నశేషమనీషి
         హృదయంగమంబు గా శబ్దంబు నమసరించియు నభిప్రాయంబు
         గురించియు భావం బుషలక్షించియు రసంబుఁ బోషించియు నలం
         కారంబు భూషించియు నౌచిత్యం బాదరించియు ననౌచిత్యంబు పరిహ
         రించియు మాతృకానుసారంబునఁ జెప్పఁబడిన యీ భాషానైషధ
         కావ్యంబు"

అని తాను జేసిన భాషాంతరీకరణమునుగూర్చి చెప్పుకొనెను. తావనౌచిత్యంబు పరిహరించితి నని కవి చెప్పుకొన్నను, నశ్లీలములును ననౌచిత్యములు నయిన యీ క్రింది పద్యములవంటివానిని వేయక మానలేదు.

     ఉ. అవ్వలిదిక్కు మో మయి ప్రియంబున నొండులతోడ ముచ్చటల్
        త్రవ్వుచు నొక్కకోమలి పరాకున నుండఁగ ధూర్తుఁ డొక్కరుం
        డివ్వల వచ్చి వంచన మెయిన్ నునుమించు మెఱుంగుటద్దమున్
        నవ్వుచుఁ బట్టె దాని చరణంబులకు న్నడుమైన మేదినిన్.

ఆ కాలమునం దిట్టి వనౌచిత్యములుగా భావింపఁబడ కుండెనేమో ! నై షధమును తెనిఁగించుటలో శ్రీనాధుఁడు సంస్కృతము నత్యధికముగా నుపయోగించి బహుస్థలములలో సాంస్కృతికదీర్ఘసమాసములతో నింపి యున్నాడు.