పుట:Aandhrakavula-charitramu.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

445

వి ను కొం డ వ ల్ల భ రా యఁ డు

         మ. "కనకాది ప్రతిమానధైర్యనిధి లింగక్ష్మావమంత్రీంద్రుతో
              ననతారాతినృపాలమంత్రిజనతాహంకారతారాహిమా
              ర్కునితో రూపరతీంద్రుతో హరిహరక్షోణీంద్రసామ్రాజ్యవ
              ర్ధనుతో సాటి సమాన మీడు గలరా రాజన్యసైన్యాధిపుల్.

 పినతాత మాత్రమే కాక కవి తండి యైన తిప్పన్న యనఁబడెడు త్రిపురాంతకుఁడు కూడ హరిహరరాయల కొలువులోనే యుండి యాతనిరత్నభాండారాధికారి యైనట్లు ప్రస్తావనలో యూ పద్యమునఁ జెప్పఁబడెను.

          సీ. సత్యవ్రతాచారసత్స్కీర్తిగరిమలఁ
                            జంద్రుతోడను హరిశ్చంద్రుతోడ
              నభిమాన విస్పూర్తి నైశ్వర్యమహిమను
                            రారాజుతోడ రేరాజు తోడ
              సౌభాగ్యవై భవజ్ఞానసంపదలను
                            మారుతోడ సనత్కుమారుతోడ
              లాలిత్యనిరుపమశ్లాఘావిభూతుల
                            భద్రుతోడను రామభద్రుతోడ

              సాటి యనదగు ధారుణీ పాలసభల
              వీర హరిహరరాయపృథ్వీకళత్ర
              రత్న భండారసాధికార ప్రగల్భు
              మల్లికార్జునత్రిపురారి మంత్రివరుని

హరిహరరాయ రత్నభాండారాధ్యక్షుఁడును వినుకొండదుర్గపాలకుఁడు నైన గ్రంథకర్త వల్లభరాయఁడు ములికినాట మూడు గ్రామగ్రాసములతో మోపూరు పాలించుట మొదలైన విషయము లీ పద్యములలో నభివర్ణింపఁ బడినవి.

          ఉ. గంధవతీప్రతీరపురఘస్మరపాదబిసప్రసూనపు
              ష్పంధయచక్రవర్తి శ్రుతపర్వతదుర్గమహాప్రధానరా
              డ్గంధగజంబు తిప్పన యఖండసుధీనిధి గాంచెఁ బుత్త్రులన్
              బాంధవకల్పవృక్షముల బైచనవల్లభమల్లమంత్రులన్.