పుట:Aandhrakavula-charitramu.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

396

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

         జీవవార దొళాది వృషభం
         ద్రావతారద బసవచరితె సమాప్తి యాయిత్తు ||
 
దీనిని బట్టి భీమకవి శకసంవత్సరము 1291 కి సరియైన క్రీస్తుశకము 1369వ సంవత్సరమున బసవపురాణమును రచించి ముగించెనని తెలియవచ్చుచున్నది గాన నితడు 1340-50 వ సంవత్సరప్రాంతమున నుండి యుండి యున్నవాడని నిస్సందేహముగా సిద్ధాంత మగుచున్నది. బసవపురాణమునందుఁ గవియే శివలెంక మంచన పండితుడును, గుర మల్లికార్డున పండితుడను ప్రసాదించిన 'యుద్దండమతి" తో గృతి చేసెదనని చెప్పుకొనియుండుట చేతను, యీతనిది యుద్దండలలిత ధారాళకవిత్వమని యితరులు పొ గడి యుండుటచేతను,

        'వచియింతు వేములవాడ భీమన భంగి
         నుద్దండలీల నొక్కొక్క మాటు'

అని శ్రీనాధుఁ డీతనికవిత్వమును శ్లాఘించుట వింతకాదు. భీమకవి కవిత్వముయొక్క యుద్దండలీల కొంత తెలియుటకును, అతడు పాల్కురికి సోమనాధుని బసవపురాణము భాషాంతరీకరించె నని తేటపడుటకును, పయిపద్యము క్రింది రెండు పద్యములను గూడ నిందుదాహరించుచున్నాను-

              ప్రతిపక్ష సజ్జన
        పక్ష సాక్షాదుక్షరాజస
        దృక్ష.........మభక్షితక్ష్వేడ ||
       త్రక్ష గణ. సమక్ష కరుణా!
       వీక్షణ జగద్రక్షణ గుణవి!
       చక్షణ బసవసూక్ష్మఅక్షయ రక్షి సెంమువను ||1||
       ఇదుసకళ మహేశ్వరామళ
       పద పయోజ పరాగనుదష