పుట:Aandhrakavula-charitramu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

337

హు ళ క్కి భా స్క రు డు

   1. మల్లికార్జునభట్టు.

      ఉ. జంగమవల్లులో యమృతసాగరవీచులొ రత్నమూర్తులో
          యంగజు మోహనాస్త్రములొ యంచిత హేమశలాకలో మహీ
          రంగనటత్తటిల్లతలొ రాజకళానఖులో యనంగఁ ద
          న్వంగులు వాద్యసంగతుల నాడుచుబాడుచునుండ నత్తఱిన్.
                                                           [బాలకాం. 308]

      శా. ప్రాణంబు ల్వల తేవి రామునకు నేర్పారంగ నన్నిచ్చిన
          ప్రాణుండై మను, మట్లుగాక మదిలో దర్పించినం దద్రణ
          క్షోణీయుక్తఖరాస్రసిక్తపటుదోస్త్సూణోగ్రబాణాసనా
          క్షీణస్పారకఠోర ఫెూరశరము ల్చెండాడు నీకంఠముల్.
                                                       [సుందరకాండ.195]
   2. కుమారరుద్రదేవుఁడు

      ఉ. వేఁడిన వేఁడి మాట నృపవీరుఁడు సై(పక కర్ణరంధ్రముల్
          సూఁడిన భంగి దాకుఁటయు స్రుక్కి మనంబున నొచ్చి నిన్ను నే
          నాఁడు నృపాలపుత్రి వని నమ్మి వరించితిఁగాక! యిమ్మెయిన్
          నేఁ డొక కాలసర్పమయి నీ విటుచేయుట నాకుఁ దోcచెనే?
                                                             [అయో. 19]

      చ. తలఁపఁగ నీ వశక్తునివిధంబున నాడెదు రామచంద్ర నీ
          కొలఁది యెఱుంగఁ డీతఁ డతికుత్సితుఁడై మతిదప్పి యాలిమా
          టలు విని యింతతెంపున కొడంబడెఁ దా నొక సత్యవాదియై
          పలుకఁడె మొన్న నేఁడు నినుఁ బట్టముఁగట్టెద నంచు బొంకొకో
                                                              [అయో.49]
   3. భాస్కరుఁడు.

      ఉ. 'ఓరి నిశాచరాధమ! మదోద్ధతిఁ దాపసవిప్రకారముల్
           వారక చేసి తా ఫల మవశ్యముఁ బొందక పోపునే? యమా