పుట:Aandhrakavula-charitramu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

     సీ. నవకోటిపరిమితద్రవిణ మే భూపతి
                     భండారము" నెప్డుఁ బాయకుండు
          నేకోనశతదంతు లే రాజుఘనశాల
                     నీలమేఘంబుల లీలఁ గ్రాలు
          బలవేగరేఖ నల్వదివేలుతురగంబు
                     లే నరేంద్రునిపాగ నెపుడు నిలుచుఁ
          బ్రతివాసరంబు డెబ్బదియేనుపుట్ల నే
                     యే విభుమందల నెపుఁడు గలుగు

          నట్టి సమథిక విభుఁ డగు కులోత్తుంగరా
          జేంద్రచోళవిభుని కిష్టసచివ
          తంత్రముఖ్యుఁ డగుచు మంత్రిగోవిందనం
          దనుఁడు కొమ్మనప్రధానుఁ డొప్పె

      చ. ఇల వెలనాఁటిచోడమసుజేంద్రునమాత్యత యానవాలుగాఁ
          గులతిలకంబుగా మనిన కొమ్మనప్రెగ్గడకీర్తి మాటలన్
          దెలుపఁగ నేల ? తత్క్రియఁ బ్రతిష్టిత మైన తటాకదేవతా
          నిలయమహాగ్రహారములు నేఁడును నెల్లెడఁ దామ చెప్పఁగన్'

వెలనాటిచోడుఁ డనెడి యీ కులోత్తంగరాజేంద్రచోడుని శాసనములు 1158-వ సంవత్సరము మొదలుకొని 1180-వ సంవత్సరమువఱకును గానఁబడుచున్నవి. ఈ రాజేం ద్రచోడుఁడే యుద్ధమునందు టేంకాణాదిత్యుఁడైన నన్నెచోడుని సంహరించి పాకనాఁడును గైకొన్నట్టు కనఁబడుచున్నది. నన్నెచోడుఁడు కుమారసంభవములో

      చ. 'అరినరపాలమౌళిదళితాంఘ్రి యుగుం డయి పాకనాఁటియం
           దిరువదియొక్కవేయిటి కధీశుఁడునాఁ జను చోడబల్లికిం
           జిరతరకీర్తి కగ్రమహిషీ తిలకం బన హైహయాన్వయాం
           బరశశిరేఖ యైన గుణభాసిని శ్రీపతికిం దనూజుఁడన్.'