పుట:Aandhrakavula-charitramu.pdf/304

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మంచన

ఈ కవి కేయూరబాహుచరిత్ర మను నాలుగాశ్వాసముల గ్రంథమును రచించి నండూరి గుండన్నమంత్రి కంకితముచేసెను. ఈ గుండన్నమంత్రి యొక్క తాతకు తాత యైన గోవిందామాత్యుఁడు వెలనాటి గొంకరాజుమంత్రియైనట్టును, ముత్తాత యైన కొమ్మామాత్యుఁడు గొంకరాజుకొడుకైన కులోత్తుంగరాజేంద్రచోళుఁ డను నామాంతరము గల వెలనాటిచోడుని మంత్రి యైనట్టును కేయూరబాహుచరిత్రమునందీ పద్యములలోఁ జెప్పఁబడినది.

     శా. ప్రాగ్దేశాపరదక్షినోత్తరదిశాభాగప్రసిద్దక్షమా
         భుగ్దర్పాంతకుఁడేలె గొంకవిభుఁడీ భూచక్ర మక్రూరతన్
         వాగ్దేవీస్తనహారనిర్మలయశో వాల్లభ్యసంసిద్ధితో
         దిగ్దంతిశ్రవణానిలోజ్జ్వలరటత్తీవ్రప్రతాపాఢ్యుడై.

     క. ఆ విభునకుఁ బ్రెగ్గడయై
         భూవలయంబున యశోభిభూషణుఁ డయ్యెన్
         గోవిందనప్రధానుం
         డావాసము కౌశికాన్వయంబునఁ దనరెన్.

     మ. విహితాస్థానమునందుఁ జూపుఁ దగ గోవిందాభిధానప్రభుం
         డహితోర్వీధరవజ్రి గొంకవిభురాజ్యాధిష్ఠుఁడై సంధివి
         గ్రహముఖ్యోచితకార్యసంఘటనతంత్ర ప్రౌఢియున్ బాఢస
         న్నహనోదగ్రరిపుక్షితీశబహుసైన్యధ్వంసనాటోపమున్.


      క. ధీరుఁడు తా గోవిందన
         కూరిమినందనుఁడు వెలసెఁ గొమ్మన గొంక
         క్ష్మారమణున కుదయించిన
         వీరుఁడు రాజేంద్రచోడవిభు ప్రెగడయై,