పుట:Aandhrakavula-charitramu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగనాథుఁడు

రంగనాథుఁ డనునతఁడు రామాయణమును ద్విపదకావ్యమునుగా రచియించిన కవి. రంగనాథుడు తన గ్రంథమునం దాంధ్రకవుల నెవ్వరిని నుతింపక పోవుటచేత నీతఁడు నన్నయభట్టారకుని కంటెను బూర్వుఁడని కొందఱు చెప్పుదురు గాని తగిన నిదర్శనములేవియుఁ గానరావు. ద్విపదరామాయణము కృత్యాదిని 'కవిలోక భోజుండు" అని బుద్ధరాజున కొక విశేషణము వాడఁబడినది. భోజరాజ శాలివాహనశకము 1021 -వ సంవత్సరమునందనగా హూణశకము 1068-వ సంవత్సరమునందున్నట్లొొ క శిలాశాసనమువలనఁ దెలియవచ్చుచున్నది. పయి విశేషణమును బట్టి భోజుఁడు కవీంద్రుల నాదరించువాఁడని దేశవిఖ్యాతి చెందిన తరువాతనే యీ గ్రంథము రచియింపఁబడుట స్పష్టము గనుక, కవి యీ రామాయణమును పండ్రెండవ శతాబ్దమునందో తరువాతనో చేసి యుండ వలెను. పదమూడవ శతాబ్దమునందు రచింపఁబడినట్లొక కథవలన నూహింపఁదగి యున్నది. ఆ కధ భాస్కరునిచరిత్రమునందుఁ దెలుపc బడును. ఇది కృష్ణామండలములోని మనుమూరి సంస్థానమునకు ప్రభువయి యుండిన [1] కోన విఠ్ఠలరాజుకొమారుఁడైన బుద్ధరాజు పేరుపెట్టి యీ కవి రచించినను, జనులు బుద్ధరాజరామాయణ మని పిలువక నేటివరకును దీనిని రంగనాథరామాయణమనియే వాడుచున్నారు. కవి బుద్ధరాజున కాశ్రితుఁ డగుటయే కాక బంధువనియుఁ జెప్పుదురు. అయినను దీని వాస్తవమును కనుగొనుట కాధారము లేవియు లేవు. ఒకవేళ రంగనాధుఁ డా రాజు నాస్థానవిద్వాంసుఁడగు బ్రాహ్మణుఁ డైన నై యుండవచ్చును. ఆఱువేల నియోగియైన కోవెల గోపరాజు రంగనాధుని నియోగికవులలోఁజేర్చి యీ క్రిందిపద్యమునఁ జెప్పియున్నాcడు.

  1. [గోన విఠల రాజు కాని కోన విఠలరాజు కాఁడు. కాన 'కోన' అనుచోట్ల నెల్లెడల 'గోన' అనుకొనవలెను]