పుట:Aandhrakavula-charitramu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

          బసవపురాణంబు పాటించి వినువేళ
                     హరునిఁ గొల్వఁ బ్రతాపుఁ డచటి కేఁగి
          'యా సంభ్రమం బేమి" యనుడు భక్తులు బస
                     వనిపురాణం బర్థి వినెద రనిన
           విన నా పురాణంబువిధ మెట్లోకో యన్న
                     ధూర్తవిప్రుఁ డొకండు భర్తఁ జేరి

           'పాలకురికి సోమపతితుఁ డీ నడుమను
            పెనఁచె మధ్యవళ్ళు పెట్టి ద్విపద
            య ప్రమాణ మిది యనాద్యంబు పద' మన్న
            నరిగె రాజు భక్తు లది యెఱింగి.

             * * * * * *

        ఉ. వారలు వచ్చురాక పరవాదు లెఱింగియు నేవ పుట్ట నా
            యూర వసించు మ్రుక్కడుల నున్మదవృత్తుల మొండివారలన్
            జేరఁగఁ బిల్చి చంద్రధరచిహ్నిత దేహులఁ జేసి యందఱన్
            బోరన మీ రెదుర్కొనఁగఁ బొండని పంచిన దుండగంబున్.'

పాల్కురికి సోమనార్యుఁడు బసవపురాణము, పండితారాధ్యచరితము, అనుభవసారము, చతుర్వేదసారసూక్తులు, సోమనాథభాష్యము, రుద్రధాష్యము, బసవరగడ, గంగోత్పత్తిరగడ, సద్గురురగడ, చెన్నమల్లుసీసములు, నమస్కారగద్యము, వృషాధిప శతకము మొదలయిన గ్రంథములు రచియించినట్టు బసవపురాణపద్యకావ్యమునం దీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.

         సీ. బసవపురాణంబు పండితారాధ్యుల
                   చరితంబు ననుభవసార మును జ
             తుర్వేదసారసోక్తులు సోమనాథ భా
                   ష్యంబు శ్రీరుద్ర భాష్యంబు బసవ