పుట:Aandhrakavula-charitramu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

243

ప్ర తా ప రు ద్రు డు

       నరవరు నీతిసారము వినం జదువం గడు మంచి దంచుఁ జె
       చ్చెరఁ గవినీతిపద్ధతులు చేసె వినోదము బాలబోధకున్."

నీతిశాస్త్రముక్తావళిని ముద్రించిన శ్రీయుత మానవల్లి రామకృష్ణ కవిగారు ప్రతాపరుద్రుఁడు సంస్కృతముననే కాక తెనుఁగునఁగూడ నీతిసారమును రచించినట్టు చెప్పి దానిలో సుండి పెక్కు పద్యముల నుదాహరించిరి వానిలో నుండి కొన్ని పద్యముల నెత్తి యిందు క్రిందఁ బొందుపఱుచుచున్నాను.

   క. "ఆపదలఁ జెందు ప్రజలను
       భూపతి మొదలిచ్చి మగుడఁ బ్రోవఁగఁ జనుఁ దాఁ
       జేపట్టి విడువవలవదు
       భూపతికిఁ గుటుంబ మనగ భూమియ కాదే

   గీ. ఎంత పొదలి యున్న నేరండమూలు జీలు
      గులను దారుకృత్యములకు నగునె ?
      యితర లెcదఱైన నేలిక కధికులై
      చేయు పనులు పూని చేయఁగలరె ?

   క. దూరము వ్యవసాయకులకు
      భారంబు సమర్థులకును భాసురవిద్యా
      పారగులకును విదేశము
      వైరము ప్రియవాదులకును వసుమతిఁ గలదే ?

   గీ. విపత్తులా వెఱింగి వెఱ పేది తొడరుట
      మిడుత లగ్గిమీఁదఁ బడినయట్లు
      తోడు లేక యధికుఁ దొడరుట యంబుధిఁ
      గలము లేక యీఁదఁ గడఁగినట్లు.

  ఉ. కొందఱ మేలమాడుటలుఁ గొందఱిి వావులుదీర్చి పిల్చుటల్
      కొందఱ ముద్దుచేయుటయుఁ కొందఱ నెయ్యపు జూపుచూచుటల్