పుట:Aandhrakavula-charitramu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతాపరుద్రుఁడు


ఇతఁడు 1117-వ సంపత్సరము మొదలుకొని 1140 -వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసిన కాకతి ప్రోలరాజపుత్రుఁడు; సుప్రసిద్ధుఁడయి తిక్కన సోమయాజికాలములో నుండి 1199 -వ సంవత్సరమునుండి 1260 వఱకును ప్రజాపాలనము చేసిన గణపతిదేవుని పెదతండ్రి. ఓరుగంటి ప్రతాపరుద్రుఁడని సాధారణముగా పిలువఁబడెడు వేఱొక ప్రతాపరుద్రుఁడు రుద్రమదేవి మనుమడు 1295 మొదలుకొని 1321 వ సంవత్సరమువఱకును కాకతీయరాజ్యపరిపాలనము చేసినవాఁ డుండి నందున భేదము తెలియుటకయి చరిత్రకారు లీతనిని ప్రధమ బ్రతాపరుద్రుఁ డందురు. ఈ ప్రతాపరుద్ర దేవమహారాజు 1140 వ సంవత్సరము మొదలుకొని 1199 -వ సంవత్సరముపుకును నేఁబదియైదుసంవత్సరము లవిచ్ఛిన్నముగా రాజ్యపరిపాలనముచేసెను. ఇతఁ డనేకరాజులను జయించి తన రాజ్యమును నానా ముఖముల వ్యాపింపఁజేసెను. ఇతఁడు పరాక్రమ వంతు డగుటయే కాక విద్యావంతుఁడుకూడ నయి తాను శైవమతస్థుఁ డగుటచేత ముఖ్యముగా శైవకవుల నాదరించుచు వచ్చెను. బసవపురాణాది వీరగ్రంధములను రచించిన పాల్కురికి సోమనాధుఁ డీతనికాలములో నుండి యీతనివలన నగ్రహారాదులను బడసెను. ఈతఁడు కవులను బ్రోత్సాహ పఱుచుచు వచ్చుటమే కాక కర్ణాటాంధ్రసంస్కృత భాషల యందు బాండిత్యము కలవాడయి విద్యావిభూషణుఁడని పేరు వడసి స్వయముగా కవిత్వము చెప్పటయందు సమర్థుడయి యుండెను. ఇతఁడు సంస్కృతమున నీతిసార మనెడు గ్రంధమును రచించినట్టు బద్దెనకవి తన నీతిశాస్త్రముక్తావళిలో నీ క్రిందిపద్యమునఁ జెప్పెను.

   చ. "పరుపడి నాంధ్రభాషఁగల బద్దెననీతియు సంస్కృతంబులోఁ 
        బరఁగ బ్రతాపరుద్రనరపాలునిచే రచియింపఁబడ్డ యా