పుట:Aandhrakavula-charitramu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పావులూరి - మల్లన


ఇతఁడు తెనుగున గణితశాస్త్రమును రచించిన మహాకవి. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; శివ్వన్నపుత్రుఁడు; ఆపస్తంభసూత్రుఁడు; గార్గ్యగోత్రుఁడు. గోదావరిమండలములోని పావులూరి *[1] గ్రామమునకు కరణము. గద్యము లోని "పావులూరి మల్లనామాత్య విరచితంబైన దశగణితశాస్త్రంబునందు" అన్న వాక్య మితఁడు నియోగి యని తెలుపుచున్నది. తక్కిన యంశము లనేకము లీతనిగణితములో నీ పద్యమునఁ జెప్పఁబడినవి.

        క. 'ఇలఁ గమ్మనాఁటిలోపల
            విలసిల్లిన పావులూరివిభుఁడను సూత్రా
            కలితాప స్తంభద్విజ
            కులతిలకుఁడ వినుతగార్గ్యగోతోద్భవుఁడన్."

ఈ పావులూరి గణితము మహావీరాచార్యులవారి సంస్కృతగణితసార సంగ్రహమునకు భాషాంతరీకరణము. ఇందలి పద్దతులు మాత్రమే పయి గ్రంథమునుండి తెలిఁగింపఁబడినవి గాని లెక్కలన్నియు మల్లనార్యునిచేత స్వతంత్రముగా గల్పింపఁబడినవే! ఈ పావులూరి గణితము గాక ప్రతాపరుద్రుని కాలములో రచియింపఁబడిన సూత్రగణిత మొకటియు, అచ్యుత దేవరాయని కాలములో వల్లభా మాత్యకవిచేఁ దెలిఁగింపఁబడిన లీలావతి గణితమును, వేంకటేశ గణితమును, ఎలుగంటి పెద్దనార్యుని ప్రకీర్ఘ గణితమును, తెలుఁగునందుఁ గలవు.

పావులూరి మల్లన తన గ్రంధమునఁ బూర్వకవుల నెవ్వరిని స్తుతించియుండ లేదు. ఈ కవి నన్నయభట్టుతోడి సమకాలికుఁ డయినటులు కనబడు

  1. [* ఇది గోదావరి మండలములోనిది కాదు; కమ్మనాcటిలోనిది కాన, గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోనిది. (చూ. ఆంధ్రకవితరంగిణి పు. 204)]