పుట:Aandhrakavula-charitramu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

195

ఎ ఱ్ఱా ప్రె గ డ

          ర్యాకరుఁ డగు పృథ్వీశమ
          హీకాంతుని మంత్రి యయ్యె నెంతయుఁ బేర్మిన్ 31


      ఉ. కౌశిక గోత్రభూసురశిఖామణి కేతన భూవరుండు పృ
         థ్వీశ నరేంద్రుమంత్రి యయి యెల్లెడఁ జాలఁ బొగడ్త కెక్కె నా
         కాశనదీమరాళశివకాశసురాశనతారకేశనీ
         కాశతరాధీరోచిరవకాశవికాసయశోవిశాలుఁడై . 32

ఈ పృథ్వీశరాజు మనుమసిద్దితండ్రి యైన తిక్కనృపాలువిచే రణరంగమున సంహరింపఁబడినట్టు విర్వచనోత్తరరామాయణఘలోవి యీ క్రింది పద్యము చెప్పుచున్నది.


     ఉ.'కేశవసన్నిభుండు పరిగీతయశోనిధి చోడతిక్కధా
         త్రీశుఁడు కేవలండె నృపు లెవ్వరి కాచరితంబు గల్గనే ?
         శై_శవలీలనాఁడు పటుశౌర్యదురంధరబాహుఁ డైన
         పృథ్వీశనరేంద్రుమస్తకము నేడ్తెఱఁ గందుక కేళి సల్పఁడే!'

ఇది 1187-వ సంవత్సరమునందు జరగి యుండును. అప్పటికి మనుమసిద్ధి తండ్రి యైన తిక్కరాజిరువదియేండ్లలోపలి వయస్సువాఁడయి యుండును. ఎఱ్ఱాప్రెగడ 1280 వ సంవత్సరప్రాంతములయందు జనన మొంది 1350 -వ సంవత్సర ప్రాంతము వఱకును జీవించి యుండును. ప్రోలయవేముని యనంతరమున నీతఁడు జీవించి యుండిన పక్ష మున వేముని పుత్రుఁడైన యనపోతనయాస్థానమున నీతఁడు కవిగా నుcడక యన్యులాస్థానకపులుగా నుండుట తటస్టింపదు. ఆనపోతనయాస్థానమునందు వెన్నెలకంటివారు కవులుగా నుండి యాతనికిఁ బ్రబంధము లొసంగినట్టు విష్ణుపురాణములో నీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.

      ఉ. ఈ నిఖిలంబు మెచ్చ నమరేశ్వర దేవుఁడు చూడఁ గృష్ణవే
           ణీనది సాక్షిగా ననికి నిల్చిన రావుతుఁ గేసభూవిభుం
           గానకుఁ దోలి వెన్నడిచి కాచిన వేమనయన్నపోతభూ
           జానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలగంటివారిలోన్,