పుట:Aandhrakavula-charitramu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

     మ. అరుదండన్ వెలనాటిచోడమనుజేంద్రాజ్ఞాపనం బూని దు
         స్తరశక్తిం జని యేకవింశతిసహస్రగ్రామసంఖ్యాకమై
         ధరణిం బేర్చిన పాకనాడు నిజదోర్దండై కలగ్నంబు గాc
         బరిపాలించె నమాత్యకొమ్మన జగత్ర్పఖ్యాతి చారిత్రుఁడై 27

      క. చలము మెయిఁ గటకసామం
         తులు కరిహయబహుళసేనతో నేతేఱన్
         దలపడియెఁ గొమ్మసచివుఁడు
         బలియుండై క్రొత్తచెర్లపరిసరభూమిన్. 28


      సీ. నెలకట్టెవాటినఁ జెలఁగి రెంటిని మూటిఁ
                  గూడ గుఱ్ఱంబులు గదులుగ్రుచ్చుఁ
         బ్రతిమొగంబగు నరపతులకత్తళమునఁ
                 గడిమిమై వీcపులు వెడలఁబొడుచు
         బందంపుగొఱియలపగిది నేనుంగల
                 ధారశుదిగ నసిధారఁ దునుముఁ
         జిదియించుc బగిలించుఁ జేతులతీఁట వో
                 వడిఁ గాండ మేసి మావతులతలలు

         తల పుడికి వేసి మావంతుతలలు శత్రు
         రాజశిరములు ద్రొక్కించు రాఁగెఁ దిరుగ
         వాగె నుబ్పెడు తన వారువంబుచేత
         మహిత శౌర్యుండు కొమ్మనామాత్యవరుఁడు 29

ఈ కొమ్మనామాత్యునికుమారుఁ డై న కేతన వెలనాటిచోడునికుమారుడై న పృధ్వీశ రాజునకు మంత్రిగా నుండెను. పృధ్వీశ రాజు 1168 మొదలుకొని 1187-వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను. మంచన వీరి నిట్లు వర్ణించెను.

     క. "ఆ కొమ్మన పెగ్గడసుతుఁ
         డై కేతన చోడభూవరాత్మజుఁడై ధై