పుట:Aandhrakavula-charitramu.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

192

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

సంవత్సరప్రాంతములకుఁ బోవును [ఇయ్యెడ 'ఆంధ్రకవి తరంగిణి" లో క్రింది విధముగఁ గలదు.

"భీమనమంత్రిని గౌరవించిన చోడుడు మొదటి యాతcడని శ్రీ వీరేశ లింగము పంతులుగా రభిప్రాయపడిరి. రెండవ చోడుఁడని నా యభిప్రాయము. ఇతనిని వీరేంద్ర చోడుఁ డందురు భీమనమంత్రి 1135 సంవత్సర ప్రాంతమున నీ వెలనాటి చోడునిచే గౌరవము నందెననియు, నప్పటి కాతఁడు ముప్పది సంవత్సరముల యిూడుగల వాఁడనియు భావించితి మేని, భీమనమంత్రి జననము క్రీ.శ.1140 ప్రాంతమైయుండును. తరమునకు ముప్పది మూఁడు సంవత్సరముల వంతునఁ జూచినచో, 1178 ప్రాంతమున బొల్లనయు 1210 ప్రాంతమున నెఱపోతసూరియు, 1245 ప్రాంతమున సూరనయు, నించుమించుగ 1280 వ సంవత్సరకాలమున మన యెఱ్ఱాప్రెగ్గడయు జన్మించి యుందురని దలంపవలసి యున్నది. శ్రీపంతులుగారనినట్లు మొదటి వెలనాటిచోడుఁడైనచో, నీయంతరమధికమై తరమునకు 45 సంవత్సరముల వ్యవధి యేర్పడి యస్వాభావిక మగును." (నాలుగవ సంపుటము, పుటలు 57, 58)

కులోత్తంగరాజేంద్రచోడుఁడే యిందుఁ బేర్కొనఁబడిన వెలనాటిచోడుఁడు.ఈ యంశమును నిర్ణయించుటకు మంచనకవి విరచితమైన కేయూరబాహుచరిత్రము మనకు కొంత తోడుపడుచున్నది. వెలనాటి గొంకరాజుమంత్రి నండూరి గోవిందామాత్యుఁడు, గొంకరాజుపుత్రుడైన వెలనాటిచోడుఁ డనఁబడెడు కులోత్తంగరాజేంద్రచోడుని మంత్రి గోవిందామాత్యుని కుమారుఁడైన కొమ్మనప్రధానుఁడు. కేయూరబాహుచరిత్రము ప్రధమాశ్వాసములోని యిూ క్రింది పద్యములను జూడుఁడు.

        మ. 'విహితాస్థానములందుఁ జూపుఁ దగ గోవిందాభిధానప్రభుం
             డహితోర్వీధరవజి గొంకవిభురాజ్యాధిష్టియై సంధివి
             గ్రహాముఖ్యోచితకార్యసంఘటన వాక్ప్రౌఢత్వమున్ బాఢస
             న్నహనోదగ్రరిపుక్షితీశ బహుసైన్యధ్వంసనాటోపమున్