పుట:Aandhrakavula-charitramu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

           నారసింహుని పురాణ మొనర్చె హరి మెచ్చి
                      నన్ను నెన్నఁడు చూచినాఁడ వనఁగఁ
           బ్రౌఢిమై హరివంశభాగముల్ రెండును
                      రచియించె సభలందు బ్రాజ్ఞు లెన్న
           
            దురితహరుఁ బ్రబంధపరమేశ్వరునిఁ జెద
            ల్వాడనిలయు నాదు వంశకర్త
            ధన్యమూర్తి శంభుదాసు నెఱ్ఱా ప్రెగ్గ
            డను నుతింప బ్రహ్మకును దరంబె.

కవియింటిపే రేర్చూరివారని పడుట యెఱ్ఱన లనేకు లుండుటచేతనే.

        సీ 'భవ్యచరిత్రుఁ డాప స్తంభసూత్రుండు
                       శ్రీవత్సగోత్రుండు శివపదాబ్ద
            సంతతధ్యానసంసక్తచిత్తుఁడు సూర
                       నార్యునకును బోతమాంబికకును
            నందనుం డిలఁ బాకనాటిలో నీలకం
                       ఠేశ్వరస్థానమై యెసఁక మెసఁగు
            గుడ్లూరి నెలవున గుణగరిష్ఠత నొప్పు
                       ధన్యుఁ డద్వైతైకతత్పరాత్ముఁ

            డెఱ్ఱనార్యుండు సకలకవీంద్రవినుతుఁ
            డైన నన్నయభట్టమహాకవీంద్రు
            సరససారస్వతాంశ ప్రశస్తి తన్నుఁ
            జెందుటయు సాధుహర్షణ సిద్ధిఁ గోరి.'

అను భారతారణ్యపర్వశేషములోని పద్యమునందుఁ గాని.

         సీ. ప్రజ్ఞాపవిత్రుఁ డాప స్తంభసూత్రుఁడు
                       శ్రీవత్సగోత్రుఁ డూర్జితచరిత్రుఁ
             డగు బొల్లనకుఁ బ్రోలమాంబకుఁ బుత్రుఁడు
                       వెలనాటిచోడనివలన మిగులు