పుట:Aandhrakavula-charitramu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

183

ఎ ఱ్ఱా ప్రె గ డ

"క. దానంబున . . . ప్రోలయసూనుఁడు కోమటి సమస్తసులభుడు కరుణన్" అను కందపద్యము ముద్రిత ప్రతిలోను, కొన్ని తాళపత్ర ప్రతుల లోను నట్లే యున్నది. అందు "ప్రోలయ' అను శబ్దము పొరపాటు. ప్రోలయకుఁ గోమటి యను సూనుఁడు లేనేలేఁడు. "ప్రోలయ" యను పదము సరికాదనియు, నచట "మాచయ" యను పదముండవలెననియూ శ్రీ వీరేశలింగము పంతులుగారు వ్రాసి యున్నారు. కాని "మాచయ" యను పదముకూడ సరికాదనియు, నచ్చట వేమయ యమ పదముండవలెనవియు నాయభిప్రాయము. కవి యీ కథా సందర్భమున వేమారెడ్డి వంశమును, నాతవి మాతృసంబంధులను మాత్రమే వర్ణించుచున్నాఁడు గాని వేమారెడ్డి కగ్రజుఁడయిన మాచన వంశమును జెప్పుటలేదు. ఇంతియగాక యూ కంద పద్యమునకుఁ బై న "అతని యనుజుఁడు" అని చెప్పియుండుటచే వేమారెడ్డికి ప్రధమపుత్రుఁడై న పోతయ చమూపతికిఁ దమ్ముఁడును వేమారెడ్డి కి రెండవ పుత్రుఁడు నైనవానిని బై కంద పద్యములో వర్ణింపనెంచెననుట నిశ్చయము. కానిచో 'అతని యనుజుండు' అను వాక్యము నిరర్ధకమగును. కావున పై పద్యములో "ప్రోలయ” అనుటకు బదులుగా వేమారెడ్డివి సూచించు వేమయ యను మాట యుండఁదగినది.

శ్రీపంతులుగారు శ్రీనాథకవి చారిత్రమున వేమారెడ్డికి "కోమటిరెడ్డి" యను పుత్రుఁడున్నాడని యంగీకరించుచు, "ఎఱ్ఱాప్రెగడ హరివంశము రచించు నాఁటి కన వేమారెడ్డి మిక్కిలి పసివాఁడు. కోమటిరెడ్డి మృతుడయ్యెను. హరివంశమునందే యీతని పెదతండ్రి కుమారుఁ డయిన కోమటిరెడ్డి యిట్లు వర్ధింపఁబడెను. అని వ్రాసి 'దానంబునఁ గర్ణుని ..? అను పద్యము నుదాహరించుచు నందలి "ప్రోలయ” అను పదమును 'మాచయ" అని మార్చి వేసిరి. ...........హరివంశ రచనము నాఁటికి వేమారెడ్డి రెండవ కుమారుడైన కోమటిరెడ్డి జీవించియే యున్నాఁడు. ఆతcడే పై కంద పద్యమువ వర్ణింపఁబడినవాఁడు"

(ఆంధ్రకవితరంగిణి నాలుగవ సంపుటము, పుటలు 95, 96)