పుట:Aandhrakavula-charitramu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

        జేతో మోద మెలర్ప రామకథ మున్ జెప్పించి యత్యుత్తమ
        ఖ్యాతిం బొందితి వింకనం దనియ నేఁ గావ్యామృతాస్వాదనన్."

హరివంశములోని మొదటి పద్యమునందలి “యన్నమవేమభూవిభున" కన్నదావి "నన్నయవేమభూవిభున కని భ్రమపడి యూ కవి తన హరి వంశమును అనవేమభూపాలున కంకిత మొనర్చినట్టు చెప్పఁబడెనుగాని యది సరికాదు. ఎఱ్ఱాప్రెగడ యనవేమారెడ్డి నెఱుఁగునో యెఱుఁగఁడో యని సందేహింపవలసి యున్నది. మనకవి యూక్రింది పద్యమునందు

     శా. వేమక్ష్మాధిపుకూర్మిపుత్రుఁడు దయావిభ్రాజి యవ్యాజతే
         జో మార్తాండుఁడు కీర్తనీయసుగుణస్తోమంబులం దేమియున్
         రామస్పూర్తికి లొచ్చుగాక సరియై రాజిల్లె రాజార్చితం
         డాముష్యాయణుఁ డెందుఁ బోతయచమూపాగ్రేసరం డిమ్మహిన్

ప్రోలయవేముని జ్యేష్టపుత్రుఁడైన యనపోతారెడ్డిని, ఈ క్రిందిపద్యమునందు

     క. "దానంబునఁ గర్ణుని సరి
         మానంబున పేర్మి ననుపమానుఁడు బుధస
         న్మానచతురుండు మాచయ
         సూనుఁడు కోమటి సమ ససులభుఁడు కరుణన్."

ప్రోలయవేమునియన్నకుమారుఁ డైన కోమటిరెడ్డిని, వర్ణించినను హరివంశమునం దెక్కడను అనవేమునిపేరైన నెత్తలేదు అందుచేత హరివంశరచనాకాలమునాఁటి కనవేముఁడు పుట్టెనో లేదో. పుట్టినను మిక్కిలి పసివాడుగా నుండెనో, యని యూహింపవలసి యున్నది. పయిపద్యములో "మాచయసూను" డన్నచోటఁ గొన్ని ప్రతులలో "పోలయసూనుఁ"డని యున్నది. మాచయసూనుఁ డన్న పాఠమే సరియయినది. [ఈ పద్యమును జర్చించుచు 'ఆంద్రకవితరంగిణి"లో నీక్రిందివిషయము వ్రాయబడినధి.]