పుట:Aandhrakavula-charitramu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

            పాపానుగాన్తు పాపాస్తాః పతీ నుపసృజం త్యుత.
            న జాతు విప్రియం భర్తుః స్త్రీ యా కార్యం కధంచన ”
                           
                                  తెలుఁగు

        చ. ఆలయక మంత్రతంత్రవివిధౌషధభంగులఁజేసి యెంతయున్
            వలతురు నాథు లంట మగువా ! కడు బేలతనంబు దానమున్
            గలిగిన ప్రేమయుం బొలియుఁ గాని యొకంటను సిద్ధిఁ బొంద ద
            ప్పొలఁతులతోడి మన్కియహిపొత్తుగఁ జూచు విభుం డెఱింగినన్.

        చ. మగువ యొనర్చువశ్యవిధి మందులు మాయలు నొండుచందమై
            మగనికిఁ దెచ్చు రోగములని మానక మూకజడాదిభావముల్
            మొగి నొనరించు నద్దురితిముల్ తన చేసినచేతలై తుదిన్
            జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్."

వీనిని చదువుటవలననే మూలగ్రంథములోని కొంత భాగము వదలి వేయఁబడినట్టు స్పష్టమగును. గనుక సత్యాద్రౌపదీ సంవాదము నందలి పద్యములలో నొక్కదానిని మాత్రము వ్రాసి యిఁక నీ విషయము విడిచిపెట్టెదను.

                                శ్లోకము
            
             ఏతాజ్ఞానా మ్యహం కర్తుం భర్తృసంవననం మహత్
             ఆపత్ స్త్రీణాం సమాచారం నాహం కుర్యాం న కామయే."
                           
                                పద్యము

         గీ. ఇట్టి వర్తకముల నెపుడుఁ బాండవులకుఁ
             దగిలి ప్రియము సేయఁదగితిఁ గాని
             మగువ నీవు చెప్ప మందులు మాకులు
             నింద్ర జాలములను నే నెఱుంగ '

ఈ కవియొక్క కవిత్వశైలి తెలియుటకయి యీ పద్యములే చాలి యున్నను, మఱియొకభాగములోని పద్యములను రెంటిని కూడ నిందు వ్రాసెదను.