పుట:Aandhrakavula-charitramu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

167

తి క్క న సో మ యా జి

ఈ శ్లోకములను పద్యములను జూచువారి కెల్లను సీసపద్యముయెుక్క. దీర్ఘపాదములయందలి వర్ణనఁ గ్రొత్తగా గుప్పించుటయే తక్కిన భాగమును గూడ యెట్లు పెంచునో విశదమగును.


శ్లోకము



            శ్లో. తాం వేళాం రర్తనాగారం పాంచాలీసంగమాశయా,
                  మన్యమాన స్ససంకేత మగారం ప్రవిశత్తత8.


పద్యము


       శా. సింగం బున్న గుహానికేతనమునకున్ శీఘ్రంబునన్ వచ్చు మా
            తంగంబుం బురుడించుచున్ బవనపుత్ర స్వీకృతంబైన యా
            రంగాగారము చేర వచ్చి మదిలో రాగంబు ఘూర్ణిల్ల నిం
            తిం గాముండిటఁ దేఁడె యింత కని యుద్వృత్తాంగజోన్మాదుఁడై

ఇఁక నీ కవి యొక్క-కవిత్వశైలిని గనపఱిచెడి యైదారు పద్యములు మాత్రము వ్రాసి 'కవిబ్రహ్మ' యని మహాకవులచేఁ గొనియాడబడిన యీతని చరిత్రము నింతటితో ముగించెదను --

         ఉ. 'అక్క_ట మోసపోయి యడియాసలఁ జావకయున్నదాన ము
              న్నొక్కెడనే దురంతదురితోత్కటబాధలఁబెట్టి యున్న నా
              కెక్కడి దుఃఖశాంతి ? గరమేదుట యెెమ్మెయిఁ గల్గ నేర్చు మీ
              ముక్కున నూర్పు గల్గ నొక మూర్ఖునిచేఁ బడితి న్సభాస్థలిన్.
                                                    విరాట. ఆ.2

          
         శా. సింగం బాఁకటితోలో గుహాంతరమునం జేట్పాటుమైనుండి మా
             తంగ స్ఫూర్జితయూధదర్శనసముద్యత్క్రోధమై వచ్చు నో
             జం గాంతారనివాస ఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
             చ్చెం గుంతీసుతమధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్.
                                                    విరాట ఆ.4

         క. కాలుఁడు ప్రేరేcపఁగ నిటు
            ప్రేలిన యంతటనె నిన్నుఁ బెద్దఁగఁ దలఁపన్