పుట:Aandhrakavula-charitramu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

   సీ. అల్లఁదనంబున ననువు మైకొనఁ జూచు
               నడపుకాంతికి వింత తొడపు గాగ
         వెడవెడ నూగారి వింతయై యేర్పడ
               దారని వళులలో నారు నిగుడ
         నిట్టలు ద్రోచుచు నెలవులు కలమేర
               లెల్లను జిగియెక్కి యేర్పడంగఁ
         దెలుపును గప్పును వెలయంగ మెఱుఁగెక్కు
               తారకంబులఁ గల్కితనము తొడరఁ

         జరణములును నడుముఁ జన్నులుఁ గన్నులు
         జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు
         "చునికిఁ దెలుపుచుండ నుత్తర చనుదెంచె
         నలరు మరునిపుప్వుటమ్ముఁ బోలె."

అను పద్యమే సృంజయరాజపుత్రిని నారదుఁడు మోహించిన కథా సందర్చమున గీతపద్యమునందలి మూడు నాల్గు చరణములు మాత్రము "ఉనికిఁ దెల్ప శాంతిపర్వమున వేయఁబడినది.
సృంజయునిపుత్రి మెలఁగు విధంబు నారదునకుఁ దగులొనర్చె" నని మార్పఁబడి

3. దేవదానవయుద్ధసంబంధమున నుత్తరరామాయణములో నున్న

   మ. పటు వేగంబున శాతభల్లదయసంపాతంబున న్మింట మి
       క్కుటమై పర్వ ధగద్ధగీయ మగుచుం గోపంబు రూపంబులై
       చటుల క్రీడఁ జరించునట్లిరువురున్ శౌర్యోన్నతిం బోరి రు
       త్కటదర్పోద్ధతులై పరస్పర జయాకాంక్షా ప్రచండంబుగన్."

అను పద్యమే "పర్వ ధగద్ధగీయమగుచున్" అని యున్న పదములు "మంట ధగద్ధగద్ధగ యనన" అనియు, 'పరస్పరజయాకాంక్షం బ్రచండంబుగన్' అనుపదము 'పరస్పరజయా కాంక్షం బ్రచండంబుగన్' అనియు మార్చబడి వేయఁబడి యున్నది.