పుట:Aandhrakavula-charitramu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

87

న న్న య భ ట్టు

గీ. నేఁడు నానోము ఫలియించె నిక్కముగను
     నేఁ గృతార్దండ నైతి నిన్నిపుడు చూచి
     నన్నుఁ బ్రోవుము నాతల్లి విన్ను భజన
     చేయుచుండుదు నేవేళఁ జిత్తమునను. 41.

వ. అని బహుస్తోత్రంబు లొనర్చి మీరిందు వసియింపవలయు. వీరల కర్థరాజ్యం బొసంగెద; గంగాస్నానంబునకు వచ్చి బహుప్రయాసంబు నొందుట మీకుఁ దెలియుంగదా యని నాటనుండి రాకుండితి మీ దర్శనం బపేక్షించి యీ బ్రాహ్మణులతో ననృతంబు పలికి మిమ్ముం దోడ్కొని రండనిన సమర్ధులైన వారలగుటంజేసి మిమ్ముందోడ్కొని వచ్చిరది కారణం బుగ మీర లీ స్థలంబున యునికి యొనర్ప వలయునని బహుభంగులఁ బ్రార్ధించినఁ బ్రసన్నయై యమ్మహాశక్తి యట్లగాక యనియె దత్క్షణంబున వారల కర్థరాజ్యం బొసంగి నందపురంబు నొసంగి తాను దద్గ్రామంబునకు నిమిత్తమాత్రుండై చాముండికా దర్శనంబు నిరంతరంబును జేసికొనుచు సంతోషంబున నుండె. నంత నవ్విప్రులు నందవరం బగ్రహారంబుగా వరించుట నందవరీకులను సంజ్ఞగలవారలైరి; మున్ను వారి వెంబడిం బోక నిల్చిన వార లార్వేల వారనం దగిరి."

పయి నుదాహరింపఁ బడిన పుస్తక భాగమునుబట్టి యొక్కొక్క చిన్న పద్యమును, పద్యమునకుఁ దరువాత బెద్దవచనమును నుండుచు వచ్చినట్టు చదువరులు తెలిసికొని యుందురు. ఈ ప్రకారముగానే పుస్తకమంతయు నత్యల్ప పద్యభాగముతోడను నత్యధిక గద్యభాగముతోడను గూడి యున్నది. నన్నయభట్టారకుని గూర్చి:

     శ్లో|| వాచా మాంధ్రమయీనాం యః
           ప్రవక్తా ప్రధమో భవత్
           ఆచార్యం తం కవీంద్రాణాం
           వందే వాగనుశాసనమ్

అను శ్లోకము పండితులలో పరంపరగా వాడబడుచున్నది.

                                         *     *     *