పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధూర్జటి వేంకటరాయకవి.

ఇతడు రత్నావళీపరిణయ మనెడు నాలుగాశ్వాసముల ప్రబంధమును రచించి చేకూరి రామస్వామిమంత్రి కంకితము చేసెను. ఈకవి కాళహస్తి మహాత్మ్యమును రచియించి కృష్ణదేవరాయని కాలములో నుండిన ధూర్జటికవి వంశమువాడు. ఇతడు తన గ్రంథమునందు ధూర్జటికవి నిట్లు స్తుతించి యున్నాడు -