పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నంజరాజు.

ఈకవి హాలాస్యమాహాత్మ్య మను డెబ్బదిరెండధ్యాయముల వచనకావ్యమును రచియించెను. ఈగ్రంథమున నధ్యాయాద్యంతముల యందు బద్యములు గలవు. కవి వంశవర్ణనమును బద్యములతోనే చేయబడినది. ఈకవి మహిశూరు రాజగు దొడ్డమహీపాలుని పౌత్రుడు; వీరరాజభూపాలుని పుత్రుడు. ఈదొడ్డభూపాలుడు 1670 వ సంవత్సర ప్రాంతములయందుండినవాడు.