పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొడిచెర్ల శ్రీనివాసకవి.

ఇతడు శేషధర్మరత్నాకర మనియెడి యాఱాశ్వాసముల పద్యకావ్యమును రచియించెను. ఈగ్రంథమును శేషధర్మము లనియు వాడుదురు. ఈకవి యాత్రేయగోత్రుడు; కొండయ భవాని పుత్రుడు; రాజమహేంద్రపుర నివాసుడు. ఇత డిన్నూఱు సంవత్సరములకు ముందుండినవాడు. ఇత డొకవేళ బదునేడవ శతాబ్ద మధ్యమునందుండి మధ్యకవులలో జేరవలసినవే డేమో! పుస్తకములోణి