ఈ పుటను అచ్చుదిద్దలేదు
కొవలె గోపరాజు.
ఈకవి యాఱువేలనియోగి బ్రాహ్మణుడు; హరితసగోత్రుడు; గోపరాజు పౌత్రుడు; కసవరాజునకును కామాంబికకును పుత్రుడు. ఇతడు సింహాసనద్వాత్రింశతిక యనుపేర విక్రమార్కుని కథలను పండ్రెండాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. ఈద్వాత్రింశత్సాలభంజికల కథలను రచించుటను గూర్చి కవి యిట్లు వ్రాయుచున్నాడు -