ఈ పుటను అచ్చుదిద్దలేదు
తరిగొండ వెంకమ్మ.
ఈమె మంచి విద్వాంసురాలు. ఈమె చేసినపుస్తకములు తఱిగొండ నృసింహస్వామి కంకితము చేయబడినవి. తరిగొండ కడపమండలములో వాయిల్పాడునకు నాలుగుమైళ్ళదూరములో నున్నది. ఈమెరచియించిన గ్రంథములలో రాజయోగసార మను ద్విపదకావ్యమును వేంకటాచలమాహాత్మ్యమను పద్యకావ్యమును ముద్రింపబడియున్నవి. ఈమె తాను భాగవతము ద్వాదశస్కంథములను ద్విపదకావ్యముగా రచియించినట్లు వేంకటాచలమాహాత్మ్యములోని యీ క్రిందిపద్యములో జెప్పుకొన్నది.