పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనంతనార్యుడు.


ఈకవి గాధేయోపాఖ్యానమును నేకాశ్వాసశృంగారప్రబంధమును రచియించి కామాంబకును జిన్నప్రభువుకు బుత్రుడగు కృష్ణభూపాలుని కంకితము చేసెను. ఇతడు తాళవలింగకవి కుమారుడు. ఈకవినిగూర్చియు నీతనికాలమును గూర్చియు మఱేమియు దెలియరాలేదు. ఇతడు నూఱేండ్లకు లోపలివాడుకాడు. ఈతని కవిత్వము హృద్యమయి యనపద్యమయియున్నది. కవితామాధుర్యమును జూపుటకై గాధేయోపాఖ్యానములోని పద్యముల రెంటి నిందుక్రింద బొందుపఱుచుచున్నాను--


భైరవకవి.


ఇతడు రత్నశాస్త్రమును దెనుగున బద్యకావ్యమునుగా రచియించెను. ఇతడు గౌరనసుతుడు. ఇతడు భ్రమరాంబికా వరప్రసాదముచేత దనకు గవిత్వము వచ్చిన ట్టీక్రిందిపద్యములలో జెప్పుకొనియుండుటచేత కర్నూలుమండలము లోనివా డయినట్టు తోచుచున్నది.