ఈ పుటను అచ్చుదిద్దలేదు
వేముగంటి దత్తోజీ పండితుడు.
ఈకవి ప్రస్థానత్రయములో నొకటియైన భగవద్గీతా యోగశాస్త్రమును బద్యకావ్యముగా దెనిగించెను. ఇతడు హరితసగోత్రుడు; నాగమాంబకును నాగోజీపండితునకును బుత్రుడు; ఆపస్తంబసూత్రుడు; మాధ్వమతస్థుడ్ని తోచుచున్నది. ఈయనకాలము మొదలయినవానినిగూర్చి యేమియు నిశ్చయముగా దెలియదు. ఇతడు నూఱుసంవత్సరముల లోపలివాడు కాడు. కృష్ణార్జున సంవాదమను నామాంతరము గల యీయోగశాస్త్రములోని కొన్నిపద్యముల నిందుదాహరించుచున్నాను--