పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణపవరపు వేంకటకవి.


ఇతడు శ్రీప్రబంధరాజ వేంకటేశ్వరవిజయవిలాసమనెడి యేకాశ్వాసప్రబంధమును రచియించెను. ఇది యేకాశ్వాసగ్రంథమేయయినను, ఇందలి పద్యములసంఖ్య మాత్రము నాలుగాశ్వాసములగ్రంథములో సామాన్యముగానుండు దానికంటె దక్కువ గాలేదు. ఈకవి నందవరీక నియోగిబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; వసిష్ఠగోత్రుడు; అప్పయామాత్యపుత్రుడు. ఇతడు కృష్ణామండలములోని కామెపల్లెసీమ యందలి గణపవరగ్రామవాసుడు. ఇతడు పల్నాటిసీమవా డగుటచేతనే స్వానుభవముచేతను గాబోలును పలనాటి గొల్లలపాటజాతి ' యని యచ్చటి గొల్లల పాటను నిరసించియున్నాడు. ఇతడు మిక్కిలి యాధుండే యయిఅను, ఇతని కాలమిదియైమాత్రము సరిగా దెలియదు. ఇతడును దనకు వేంకటేశ్వరుడు స్వప్నమున సాక్షాత్కరించి తనుగూర్చి పలికినట్లు చెప్పుకొన్నపద్యములలోని యీక్రిందిపద్యమువలన నితడు పదునాఱవశతాబ్దాంతమునకు లోపలివాడుకాడని స్పష్టమగుచున్నది.--