పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అత్తలూరి పాపకవి.

ఈకవి చెన్నబసవపురాణమను నయిదాశ్వాసముల పద్యకావ్యమును రచియించి మాపూర్వులలో నొకరయిన కందుకూరి యమృతలింగముగారి కంకితము చేసెను. మా పూర్వులు మహమ్మదీయ ప్రభుత్వములో "దేశపాండ్యా" లయి ఘనతనుబొంది పెక్కు కావ్యములను కృతులనంది కవుల నాదరించియున్నారు. పూర్వము కృతిపతు లయిన వారిని గూర్చిన కొన్నిపద్యముల నీపుస్తకమునుండి య్ం దుదాహరించుచున్నాను.