పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుష్పగిరి తిమ్మన్న.

ఈకవి సమీరకుమారవిజయ మనెడి యేడాశ్వాసముల కావ్యమును రచియించి, భర్తృహరి నీతిశతకమును తెనిగించెను. ఇత డుత్తరరామాయణమును రచియించిన కంకటి పాపరాజుతో సమకాలికుడు. ఇతడు రచియించిన సమీరకుమారవిజయ ముత్తరరామాయణ మంత మధురముగా లేదు. భర్తృహరి నీతిశతకము సహిత మేనుగు లక్ష్మణకవి తెనిగించినదానికి చాలదు.