పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

మనభాషయందు,చరిత్ర గ్రంథములు కడుస్వల్పములుగా నున్నవి,స్వల్పములుగాదు,లేవనికూడా చెప్ప సాహ సింతును.జాత్యాభ్యుదయమునకు చరిత్ర ముఖ్యసాధనములగుచుండ, మనకింతవఱకు, చక్కని దేశచరిత్రలు లేకుండుటకడుశోచనీయము. చరిత్రపఠనము వలననే జనులకు, దేశముపై నభిమానమును గౌరవమును జనించును. "నాజన్మభూమియిది!నే నాంధ్రుడనని గర్వించుచున్నాను" అని భావము లుత్పన్నములగును. అంతట జాఱిన దేశగౌరవమును చక్కదిద్దుటకు ప్రయత్నములు లప్రయత్నముగ జరుగుచుండును.కావున నే నిపుడీ చిన్న గ్రంథమును, మన ఆంధ్రయువతీ యువకులకు, ఆంధ్రదేశముపై, నాంధ్రజాతిపై, నభిమానము ను, గౌరవమునుజనింపజేయుటకు వ్రాసి సమర్పించుచున్నాను.

ఈ గ్రంథమునందు, మువ్వురిని వర్ణించినాము.అందొకడు ఏడవశతాబ్దాదిని యేతెంచిన చీనాయత్రికుడు. రెండవ వాడు, కాకతీయాంధ్ర సామ్రాజ్యము మహోచ్ఛదశయండుండిన కాలమున వచ్చిన యిటాలియా వాస్తవ్యుడు. మూడవవాడు విజయనగర సామ్రాజ్యవైభవమును చవిజూచిన పారశీక రాయబారి.

ఏడవశతాబ్దిని హిందూదేశమునంతటను మాహత్తరములయిన పరిణామములు జరుగుచుండెను.ఉత్తర