౧౮
ఆంధ్రదేశము-విదేశయాత్రికులు
గాంపించుచున్నవి. ఏడవశతాబ్దమునకు బూర్వము కళింగము కొంతకాలము పల్లవరాజుల పరిపాలనము క్రింద నుండెను[1]. ఆకాలమున పిష్ఠపురమో యలమంచిలియా, నరసన్నపేట సమిాపముననున్న సింహపురమో, రాజధానియై యుండవలయును. ఈపల్లవ రాజులలో సింహపురశాసనమందు నంద ప్రభంజనవర్మ, చండవర్మ, ఉమవర్మ యను మువ్వు ర రాజులపేరు లుదాహరింపబడి గానవచ్చుచున్నవి[2]. వీరిలో నెవ్వరుముందో యెవ్వరు తరువాతనో తెలియరాదు. కాని వీరందఱకును సింహపురము రాజధానిగా నుండిన మాట నిశ్చయము. క్రీ. శ. ౫, ౬ శతాబ్దములందు కళింగరాజులకును వేంగిరాజులయిన విష్ణుకుండినులకును బద్ధవైరముగా నుండెను. దక్షిణకోసలము నేలు వాకాటకరాజులు, విష్ణుకుండినులకు దగ్గర బంధువులగుటచేత నుభయులును కళింగరాజ్యమునకు చాలభాధాకరులుగా నుండి ఇరుప్రక్కలనుండి తొందరలు గలుగ జేయుచుండిరి. ఈ కారణమున సర్వదా యుద్ధములలో మునిగి తేలుచుండుటవలన యుఁఆన్ చ్వాంగ్నకు దేశము జనసమ్మర్దముగా గన్పట్టియుండక పోవుటలో నాశ్చర్యమేమి? ఏడవశతాబ్దమందు కళింగరాజ్యమున గాంగపల్లవ వంశమొకటి తలయెత్తి విజృంభించి కళింగనగరమును (ముఖలింగము) రాజధాని