యుఁఆన్చ్వాంగ్ వర్ణించిన ఆంధ్రదేశము
౧౩
గూర్చి పయనమయ్యెను. ఈకాలమున కళింగము యొక్క నిజరూపమును నిరూపించుట దుస్తరము. క్రీస్తుశకారంభ కాలమున కళింగదేశమాంధ్ర సామ్రాజ్యములో జేరిపోయినది మొదలు కాళింగులు నాంధ్రలో కలిసిపోయి, నామమాత్రమున కొక తెగవారు గానునట్లుంపించెడిని.[1] కాళింగుల వేషభాషలు, నాగరికత మున్నగునవి యాంధ్రములో సమ్మేళనమైపోయెను. మరియు నేడవశబ్ధాదిని, కళింగమును బరిపాలించుచుండిన రాజవంశములు గూడ వేంగీ దేశమునుండి, వలసబోయిన వారలుగా గన్పపట్టుచున్నారు. మన యాత్రికుడీకళింగమును ప్రవేశించినది మొదలు, వ్రాసిన దానిని బరీక్షించి యందలి వృత్తాంతములు ఎంతవరకు జరిత్రసిద్ధములో వరయుదము. ఈ కళింగముగూర్చి యుఁఆన్ చ్వాంగ్ యిట్లు వ్రాయుచున్నాడు.
"కుంగ్-యూ-టో (కొన్యోఢ) దేశమునుండి నైఋతి దిక్కుగా జనిన చామలులేని యొక విశాలమైన యెడారివంటి భూమిని ప్రవేశింతుము. దానినిదాటిన వెనుక, సూర్యకిరణములను సయితము గప్పివేయునంతటి యున్నతములయి తల విరియబోసి కొన్నట్లుండు వృక్షములతో నిండి గాఢాంధకారమయిన మహారణ్యములను వనములను దాటి సుమారు
- ↑ కళింగము, వేంగిరాజ్యము, ఆంధ్రము దక్షిణకోసల మున్నగునవి మహాంధ్ర దేశములోని, వివిధ ప్రాంతములకు వచ్చియుండిన యాపాత నామములుగా గ్రహింప వలయును