ఈ పుట ఆమోదించబడ్డది
గుచున్నది. ఆతడు త్రిరాత్రయుత్సవములనే వర్ణించి మహర్నవమి యుత్సవములని జెప్పినాడు. ఆతడు పొరబడి యుండవచ్చును లేదా యీతడు వ్రాసిన చరిత్రలో కొంతభాగము శిధిలముకాగా శేషించిన దానిని సంస్కరించి పూరించినవారు పొరబడియుందురు. అబ్దుర్ రజాక్ రాయల పరిపాలనావసానదశయందుండి, విజయనగర వైభవమునుకన్నులార గాంచి, వర్ణించిన యదృష్టవంతుడు. మన కందువలన చిరస్మరణీయుడు.