పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్ చ్వాంగ్ వర్ణించిన ఆంధ్రదేశము

భరతఖండమును సందర్శించిపోయిన విదేశీయులలో యాత్రికులలో జీనాదేశీయుఁడగు యుఁఆన్‌-చ్వాంగ్‌ సుప్రసిద్ధుడు. భారతీయ ఇతిహాసికుల కితడు జిరస్మరణీయుడు.కీర్తినీయుడు. అతడు జన్మించుటజేసి చీనాదేశము ధన్యత నొందెను ఆ మహానీయుడు భరత వర్షమున కేతెంచి చిరకాలము దేశమందు సంచారము గావించి బౌద్ధ విద్య నభ్యసించుచు తానేగిన దేశములందు చూచినదానిని, వినిన దానిని, తెలుసుకొనిన దానిని తన చక్రవర్తి కుల్లాసము కొఱకు గ్రంథస్ధము చేసి యుండెను. అందువలన నాతని కాలము నాటి మన దేశపు వ్యవస్థల గూర్చియు, పరిస్థితుల గూర్చియు దెలిసికొనుటకు అవకాశము గలుగుచున్నది. చీనాదేశమున నితడు కన్‌ప్యూషీయన్‌నకు తరువాత నింతటీ ధర్మవేత్త లేడని పేరొందెను. బుద్ధుని తరువాత రాబోవు కల్పమునందు సుగతులగు బోధిసత్త్వులలో నొకడయ్యెనని ప్రసిద్ధికెక్కెను.

ఈతని కొందఱు హ్యూ౯ త్స్యాంగనియు కొందఱు హౌనుత్స్యాంగనియు మరికొందఱు యుఁవాన్‌ త్స్యాంగ్‌ అని యు, యుఁఆౝ చ్వాంగనియు వివిధములుగ బిలుచు
1