Jump to content

పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్కో పోలో

యుఆన్‌చ్వాంగునకు వెనుక నాంధ్రదేశమును సందర్శించి చనిన విదేశీయులలో పదమూడవ శతాబ్దాంతమున ఏతెంచియుండిన మార్కోపోలో ఆంధ్రులకృతజ్ఞతకు బాత్రుడు. ఆతని జీవితమును ఆతని గ్రంథమును కడు మనోజ్ఞములు. ఆతడు తెలిపిన విశేషములన్నియు వింతకథల వలె దోచుచుండును. పాశ్చత్యప్రపంచమున టోలమీ తరువాతను కొలంబసునకు బూర్వము, నీతని బోలిన భూగోళ శాస్త్రజ్ఞుడుగాని, భూప్రదక్షణముచేసి వచ్చినవాడుగాని మరియొకడు గానరాడు. కొందఱు పండితులీతని కొలంబసు కంటె ఘనుడని వాదించుచున్నారు. మార్కోపోలో జన్మింప కుండిన కొలంబసు ఆమెరికాను చూడగలుగుట జరిగియుండక పోవునని వారి తాత్పర్యము. హిందూస్థానముయొక్క నాగరతావిశేషము, హిందూదేశీయులయొక్క బుద్ధి, ప్రతిభ, తేజము, ఐశ్వర్యము ఖండఖండాంతరములకు వ్యాపించుటకు మధ్యయుగము నందు మార్కోపోలో కారకుడు. ఆతడు రచించిన గ్రంథము సాహసిక జీవులకు నూతనోత్సాహము బోసి యావేశము కలిగించెను. దానిఫలితమే, కొలంబసు అమెరికాను గనుగొనుటయు, పోర్చుగీసువారు అట్లాంటిక్ మహాసముద్రము నంతయు దాటి, ఆఫ్రికా ఖండమును జూట్టివచ్చి, హిందూ దేశమును, సముద్రము మీదుగా జేరుకొనుటయు నని చెప్పవచ్చును.

మార్కోపోలో జీవిత మొక చిత్రమైన కధవలె నుం