పుట:ASHOKUDU.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

అ శో కుఁ డు

స్పష్టముగా నెట్లు చెప్పఁగలడు ? రాణియగు సుభద్రాంగి కెట్లో యీ వార్త తెలియవచ్చెను. తోడ నే యామె తన కుమారునిగూడఁ బరీక్షా పరిషత్తునకుఁ బంపించెను. సుభద్రాంగి తన కుమారుని బరీక్షా సభకుఁ బంపఁబోవునప్పటికి రాజాస్థానమునందలి సుందరామూల్య వాహనాదికముల నన్నింటినుపయోగించుకొని తక్కిన ప్రభుకుమారు లఁ దఱును సభకుఁ బోయియుండిరి. ఒక ముసలియేనుఁగు మాత్రము మిగిలియుండెను. అశోకుఁడు తల్లి యొద్ద సెలవు తీసికొని యా ఏనుగు పై నెక్కి బయలు దేరెను. అప్పటి కా సభారంగమంతయును జనసమ్మర్దముగ నుఁడుటం గాంచి యశోకుఁడాచంద్రాతప బహి ర్భాగమునఁ గోమల శాద్వలతలంబునఁ గూర్చుండి యుండెను.

సన్యాసి యగు పింగళవత్సజీవుఁడు పరీక్షుకుడుగ నియమింపఁబడియెను. క్రమక్రమముగా రాజకుమారు లందఱును పరీక్షింపబడిరి. విద్యాబుద్ధులయందు రాజకుమారు లందఱలోనను నశోకుఁడే యున్నత స్థానము నలంకరించినట్లు నిరూపితమయ్యెను. ఆతఁడే సుళీలుఁడును సూక్మబుద్ధియు నని యందఱకును బోధపడెయెను. కాని యాఁతడు కురూపి; శోభావిహీఁనుడు; జనకుని కప్రియుఁడు ! ! అప్పు డయ్యశోకుని యుత్తమత్వంగూర్చి యంత బహిరంగ ముగ సంత విస్పష్టముగఁ బ్రశంసించుట కెవ్వరును సాహ సింపఁజాలకపోయిరి. పరీక్ష కుడఁగు పింగళవత్సజీవుఁ డెల్ల విధముల బాగుగ నాలో

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/40&oldid=333539" నుండి వెలికితీశారు